బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై ఒక్కసారిగా సినీ ప్రపంచం మొత్తం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. అతని మరణం తీరని లోటు అంటూ అన్ని భాషల సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆయన మరణంపై స్పందిస్తున్నారు.
ఇటు తెలుగులో కూడా పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేస్తూ తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు. సుశాంత్ మరణ వార్త విని తాను షాక్ అయ్యా అని తారక్ ట్వీట్ చేసాడు. అద్భుతమైన టాలెంట్ వెళ్లిపోయింది చాలా త్వరగా అంటూ అతని ఆత్మకు శాంతి కలగాలి అని పేర్కొన్నాడు.
Shocked to hear the news of #SushantSingh's demise. An incredible talent gone too soon. Rest in Peace.
— jr ntr (@tarak9999) June 14, 2020