దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16 17 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ... సిఎం లతో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా కరోనా ప్యాకేజిని మరోసారి పొడిగించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు భారీ ప్యాకేజిని మరోసారి ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.
దాదాపు కరోనా ప్రభావం ఇంకా మూడు నెలలు ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్రాలకు అదనపు నగదు ఇచ్చే దాని మీద కసరత్తు చేసే అవకాశం ఉంది అని దీనిపై సిఎం లతో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అని సమాచారం. ఈ సారి పేదలకు భారీ ప్యాకేజి ఉండే అవకాశం ఉంది.