దేశం మొత్తాన్ని ఇప్పుడు కరోనా వైరస్ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తీసుకునే చర్యలు కూడా ఫలించడం లేదు. దీనితో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందరి సలహాలను తీసుకుని ముందుకు వెళ్ళాలి అని భావిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఇప్పుడు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి గానూ సిద్దమయ్యారు. 

 

రేపు అన్ని పార్టీలను ఆల్ పార్టీ మీటింగ్ కి ఆహ్వానించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇప్పటికే అమిత్ షా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి చేయడానికి గానూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: