టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కెప్టెన్ అవడంతో ప్రపంచం ఒక గొప్ప బ్యాట్స్మెన్ ని కోల్పోయింది అన్నాడు టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్. ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నడూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయలేదని వ్యాఖ్యానించాడు. 

 

ధోనీ కనుక ఆ స్థానంలో బ్యాటింగ్ చేసి ఉంటే ఓ గొప్ప ఆటగాడిని ఈ ప్రపంచం చూసి ఉండేదని అతను అభిప్రాయపడ్డాడు. ఆ స్థానంలో ధోనీ బ్యాటింగ్ చేసి ఉంటే ఎన్నో రికార్డులు బద్దలై ఉండేవని అభిప్రాయపడ్డాడు. అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడిగా నిలిచేవాడని వ్యాఖ్యానించాడు. గతంతో పోలిస్తే ఇప్పడు నాణ్యమైన బౌలర్లు లేదని అభిప్రాయపడ్డాడు. క్రికెట్ లో అసలు నాణ్యత అనేది లేదు అని గంభీర్ కీలక వ్యాఖ్యలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: