అహ్మదాబాద్ సమీపం లో ఘోర విషాదం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో గుంగార్డీ గ్రామానికి చెందిన నలుగురు గిరిజన బాలికలు స్నానం  చేయడానికి గానూ చెరువులో దిగారు. ఇక వారు స్నానం చేస్తున్న సమయంలో ఒక అమ్మాయి చెరువులో మునిగిపోయింది. 

 

దానిని గమనించి సహాయం చేయడానికి వెళ్లి ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమై గజ ఈతగాల్లను రంగం లోకి దించినా సరే వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వీరు నలుగురు రెండు కుటుంబాలకు చెందిన వారు అని తెలిసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: