కరోనా కేసులు నగరాలలో ఎక్కువగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇప్పుడు నగరాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టారు అని తెలుస్తుంది. ఢిల్లీ లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వంతో కలిసి ఆయన చర్చలు జరిపారు. ఇక కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ... ఆయన అధికారులను కూడా అదనంగా అందించారు. 

 

ఇప్పుడు ఆయన దృష్టి ముంబై మీద పడింది అని సమాచారం. ముంబై లో కరోనా కట్టడికి గానూ మహారాష్ట్ర సిఎం తో ఆయన చర్చలు జరుపుతారు. ఆ తర్వాత తమిళనాడు సిఎం తో చెన్నై కి సంబంధించి ఇక హైదరాబాద్ కి సంబంధించి కేసీఆర్ తో అమిత్ షా చర్చలు జరపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: