దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని ప్రకటించే విషయంలో ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే దాని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విషయంలో ముందుకు అడుగు వేస్తున్నాయి. తమిళనాడు లాక్ డౌన్ కావాలి అంటుంది. అదే విధంగా ఓడిశా పశ్చిమ బెంగాల్ కూడా లాక్ డౌన్ ని కోరుతున్నాయి. 

 

అయితే మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ ని అసలు ఏ మాత్రం కూడా అంగీకరించడం లేదు అనే సంగతి తెలిసిందే. త్వరలో దీనిపై ప్రకటన వస్తుంది అనే ప్రచారం ఉన్న నేపధ్యంలో తమకు లాక్ డౌన్ వద్దు అని కొన్ని రాష్ట్రాలు  కేంద్రానికి లేఖలు రాస్తూ విజ్ఞప్తి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: