బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి మిస్టరీగా మారింది. కెరీర్ మంచి రైజ్ లో ఉన్న సమయంలో ఆయన ఆత్మహత్య ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. సుశాంత్ మరణంతో ఆయన స్వస్థలం పాట్నాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తాజాగా ఆయన కుటుంబసభ్యులు సుశాంత్ హఠాన్మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్​ సూసైడ్ చేసుకోలేదని.. హత్య జరిగుంటుందని ఆయన మేనమామ ఆరోపణలు చేశారు. 
 
బీహార్ యువజన సంఘం, రాజ్ పుత్ మహాసభ సుశాంత్ ది హత్య అని... సీబీఐ ఎంక్వైరీ చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, ప్రధాని మోదీని హ‌త్య‌పై దర్యాప్తు చేయించాలని తాము కోరుతున్నామని వారు తెలిపారు. ఇటీవలే సుశాంత్​ మేనేజర్​ దిశా శాలిన్​ సూసైడ్ చేసుకున్న కేసులో పోలీసులు సుశాంత్​పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన మేనమామ ఆర్​.సి. సింగ్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: