ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతుందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. 
 
రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరగనుంది. ఈరోజు జరగబోయే శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు నేతలతో ఈ విషయాల గురించి చర్చించనున్నారు. ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలు రెండు రోజులు మాత్రమే జరగనున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: