విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. ఇక ఈ ఘటనలో ఎంతో మంది అస్వస్థతకు గురి కాగా దాదాపుగా 14 మంది ఈ ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం భారీ మొత్తంలో మృతులు బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన విషయం తెలిసిందే. 

 

 ఇక తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించేందుకు లేఖలు రాశారు. ఒక్కో కుటుంబానికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు. వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: