ఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం కుసుమంతైన కనిపించడం లేదు. ఏకంగా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని హతమార్చేందుకు కూడా వెనకాడడం లేదు కసాయిగా మారుతున్న తల్లులు . తల్లి అంటే ప్రేమకు ప్రతిరూపం కానీ.. అలాంటి తల్లి గా ఉండి కన్నబిడ్డనే అతి దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణం ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
సభ్య సమాజం తలదించుకునేలా ఇక్కడ ఒక తల్లి కసాయిగా మారిపోయింది. ఏకంగా కన్న పేగు బంధాన్ని మరిచి పిల్లలని చెరువులోకి నెట్టేసింది. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారులు మృతి చెందారు. అయితే ఆ తల్లి ఇంత కసాయి గా మారడానికి కారణం భార్య భర్తల మధ్య తలెత్తిన గొడవే అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.