దేశ రాజధాని ఢిల్లీ లో ఇప్పుడు కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉంది ఢిల్లీ. అక్కడి ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే కరోనా మాత్రం దాని పని అది చేస్తూ ప్రజలను బాగా ఇబ్బంది పెడుతుంది అనేది వాస్తవం.
ఇక కరోనా కట్టడిలో కీలకమైన వైద్య సేవల విషయంలో మాత్రం ఢిల్లీ సర్కార్ ఘోరంగా విఫలం అవుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ లో కరోనా రికవరీ రేటు 38 శాతం మాత్రమే అని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో అత్యల్ప రికవరీ రేటు ఉన్న రాష్ట్రం ఢిల్లీ అని తెలుస్తుంది. దీనితో కేంద్రం కూడా ఢిల్లీ కేసుల విషయంలో సీరియస్ గా ఉంది.