.ఆంధ్ర రాజకీయాల్లో  ఈఎస్ఐ స్కాం ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈఎస్ఐ స్కామ్ విషయంలో ఏకంగా టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిపోయింది. అయితే బీసీ గనుకే  అచ్చన్నాయుడు ని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు అంటూ టిడిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

 

 తాజాగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈఎస్ఐ స్కామ్ లో ప్రభుత్వ ఖజానాను పూర్తిగా దోచేశారు అంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు  పేద కార్మికుల సొమ్మును దోచుకు తింటున్నారు అంటు  ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో అడుగడుగునా అవినీతి  జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: