తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా భారీన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ కాగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు తేలింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ కు కరోనా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఇప్పటికే కరోనా నిర్ధారణ అయిన బాజిరెడ్డితో కొన్నిరోజుల నుంచి సన్నిహితంగా బిగాల గణేష్ మెలిగారు. దీంతో గణేష్ కు కూడా కరోనా సోకింది. ఒకే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడటంతో పార్టీ నేతల్లో కలవరం నెలకొంది. అధికారుల నుంచి ఈ మేరకు సమాచారం అందుతోంది. నిన్న సాయంత్రం పరీక్షలు నిర్వహించగా ఈరోజు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: