ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ అవినీతి చేసి అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. వాళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేశ్‌ల బండారం వెలుగు చూస్తుందని వ్యాఖ్యలు చేశారు. జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్ బండారం బయటపడుతుందని... అందుకే కుడితిలో పడ్డ ఎలుకల్లా చంద్రబాబు, లోకేష్ కొట్టుకుంటున్నారని చెప్పారు. 
 
టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంతో భయపడుతున్న లోకేష్, చంద్రబాబు విజయవాడ, అనంతపురానికి పరుగులు తీశారని ఎద్దేవా చేశారు. అరెస్ట్ అయిన నేతలను బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశాడని ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు తాము నిప్పు అని చెప్పుకుంటారని అలాంటి వారు కక్ష సాధింపు చర్యలు అనడం సిగ్గు చేటని ఆమె వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు వైరస్ భారీన పడి అల్లాడుతుంటే చంద్రబాబు ఒక్కరోజు కూడా ప్రజలకు భరోసా ఇ‍వ్వలేదని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: