కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇక నేడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని కూడా ప్రవేశ పెడుతుంది. కాసేపట్లో ఏపీ కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో  బడ్జెట్ కి మంత్రి వర్గం ఆమోదం తెలుపుతుంది. గవర్నర్ ప్రసంగ౦ తర్వాత బిఏసి సమావేశం జరుగుతుంది. 

 

ఇక ఇదిలా ఉంటే 2.25 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ని ప్రవేశ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇక ఉదయం 10 గంటలకు గవర్నర్ ఆన్లైన్ లో ప్రసంగం ఉంటుంది. కరోనా కారణంగా రెండు రోజులు మాత్రమే ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సహా అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు శానిటేషన్ చర్యలను పూర్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: