దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆలస్యంగా ఒక ఘటన కలకలం రేపింది. ఢిల్లీ లో నివాసం ఉంటూ పని చేస్తున్న ఒక అమ్మాయిని రేప్ చేసిన ఘటన సంచలనంగా మారింది. 16 ఏళ్ల అమ్మాయిని స్వస్థలమైన జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామని చెప్పి మాయ మాటలతో ముగ్గురు యువకులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేసారు. 

 

జార్ఖండ్ వెళ్లేందుకు గానూ ఆనంద్ విహార్ రైల్వేస్టేషనుకు రాగా ఆమెను ముగ్గురు యువకులు రైలు ఎక్కిస్తామని చెప్పి తీసుకుని వెళ్లి మద్యం తాగించి రేప్ చేసారు. ఆ తర్వాత ఆమెను నడి రోడ్డు మీద వదిలేసారు. ఆమె మత్తులో నడుస్తూ ఉండగా ఒక కానిస్టేబుల్ గుర్తించి ఆమెను తీసుకుని వెళ్లి వైద్య పరిక్షలు చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: