దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో మాత్రం కేసుల పెరుగుదలలో మార్పు అయితే వచ్చింది. నిన్నటి తో పోలిస్తే దాదాపు వెయ్యి కేసుల వరకు తగ్గాయి దేశ వ్యాప్తంగా. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో దేశంలో నిన్నటికి నేటికి కేసుల పెరుగుదలలో మార్పు అనేది కనపడింది. 

 

గత 24 గంటల్లో 10,667 కొత్త కేసులు మరియు 380 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 343091 గా ఉందని అదే విధంగా 1,53,178 క్రియాశీల కేసులు ఉన్నాయి అని కేంద్రం పేర్కొంది. 1,80,013 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా... దేశ వ్యాప్తంగా మొత్తం కరోనాతో 9,900 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: