ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కరోనా చర్యల్లో భాగంగా ఆయన వీడియో ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇక మేనిఫెస్ట లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది అని అన్నారు. గత ఏడాది తో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం పెరిగిందని అన్నారు. సేవా రంగంలో 9.1 శాతం వృద్ది ఉందని పేర్కొన్నారు. 

 

వ్యవసాయ రంగంలో వృద్ది సాధిస్తున్నారని అన్నారు. లబ్ది దారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగంలో 5 శాతం మంది లబ్ది పొందారని అన్నారు. 129 హామీల్లో భాగంగా 77 హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది అని అన్నారు గవర్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: