దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. లక్ష కేసులు అయ్యే రెండో రాష్ట్రంగా ఢిల్లీ ఉండే సూచనలు కనపడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి చర్యలు తీసుకుంటున్నా సరే ఆగడం లేదు. ఇక ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ కి కరోనా సోకినట్టు సమాచారం. 

 

అయన అనారోగ్యానికి గురి కావడంతో రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో  జాయిన్ అయ్యారు. ఆయనను ఐసియు లో పెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు అన్ని కరోనా లక్షణాలు ఉన్నాయి అని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆయనకు నేడు కరోనా పరిక్షలు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: