జగనన్న వసతి దీవెన కింద 3857 కోట్లను ఖర్చు చేసామని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద 42 వేల కోట్లను ఖర్చు పెట్టామని చెప్పారు. విద్యార్ధులకు పౌష్టికాహారం కోసం గానూ జగనన్న గోరు ముద్ద కార్యక్రమాన్ని మొదలు పెట్టామని అన్నారు. 

 

వైఎస్సార్ కంటి వెలుగు కింద 67 లక్షల మందికి లబ్ది చేకూరింది అని అన్నారు గవర్నర్. జగనన్న వసతి దీవెన కింద 18 లక్షల మందికి అందించామని చెప్పారు గవర్నర్. ఆరోగ్య శ్రీ ద్వారా 6 లక్షల మందికి వైద్యం అందించామని చెప్పారు. నాడు నేడు లో భాగంగా ఆస్పత్రులకు 15 వేల కోట్లు ఖర్చు చేసామని చెప్పారు గవర్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: