ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇక నిరసన తెలుపుతూ టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి సభకు హాజరయ్యారు. ఇక సభలోకి గవర్నర్ ప్రసంగం సమయంలో వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ వాకౌట్ చేసారు. నిరసనగా తాము సభ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యేలు. 

 

కక్ష సాధింపులు వేధింపులు అంటూ   నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఇక అందరూ కూడా నల్ల చొక్కాలు వేసుకుని సభలోకి వెళ్ళారు. కాగా సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉండగా టీడీపీ నిరసన తెలిపింది. రెండు రోజుల పాటు మాత్రమే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేడు బడ్జెట్ ప్రవేశ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: