అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో కాసేపట్లో బిఎసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో 18 అంశాలను ప్రస్తావించాలి అని టీడీపీ భావిస్తుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అదే విధంగా బలవంతపు భూ సేకరణ, ఇసుక అక్రమ రవాణా, మూడు రాజధానులు, ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ప్రకటన వంటి వాటిని ప్రస్తావించడానికి టీడీపీ సిద్దమవుతుంది. 

 

అదే విధంగా కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం సహా పలు అంశాలను టీడీపీ ప్రస్తావిస్తుంది. ఇక ఈ సమావేశ౦లో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలను నడపాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. బిఎసి సమావేశం అనంతరం సభ తిరిగి ప్రారంభం కానుంది. బడ్జెట్ ని ఒంటి గంటకు ప్రవేశ పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: