జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఒకరి తర్వాత ఒకరిని భారత బలగాలు కాల్చి చంపుతున్నాయి. కీలక ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపుతూ వస్తుంది. ఇక ఈ ఏడాది ఆరు నెలల్లో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. టాప్ కమాండర్ లు అందరిని కాల్చి చంపుతున్నారు.

 

తాజాగా దీనిపై కాశ్మీర్ ఐజి విజయ్ కుమార్ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో 94 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు తమ దృష్టి ఉత్తర కాశ్మీర్‌పై ఉంటుందని అన్నారు. నేడు ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపామని వారి తల్లి తండ్రులు వస్తే వారికి మృతదేహాలను అందిస్తామని వారు ఎవరో గుర్తించి అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: