బిల్డ్ ఏపీ మిషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో భూములను అమ్మాలి అని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఉన్న పలు భూములను విక్రయించడానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కొన్ని ప్రాంతాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. గుంటూరు లో ఉన్న పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ని కూడా అమ్మాలి అనుకున్నారు. 

 

కాని అక్కడ వందల మంది వ్యాపారులు బ్రతుకుతున్న నేపధ్యంలో అమ్మవద్దు  అని మినహాయింపు ఇచ్చింది ఏపీ సర్కార్. దీనితో టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సహా కూరగాయల్ వ్యాపారులు అందరూ కూడా సిఎం జగన్ ఫోటో కి పాలాభిషేకం చేసారు. జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: