ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ లకు నిరసనగా నల్ల చొక్కాలతో సభలోకి వచ్చారు. చంద్రబాబు సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు అందరూ కూడా నల్ల చొక్కాలతోనే సభలోకి వచ్చారు. ఇక ఈ సందర్భంగా టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పీపీఈ కిట్ ధరించి సభలోకి వచ్చారు. దీనికి కారణం ఆయన వయసు 70 ఏళ్ళకు పై బడి ఉండటమే. 

 

వాళ్లకు ప్రమాదం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈ విధంగా ఆయన సభలోకి వచ్చారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ అందరూ కూడా సభలోకి మాస్క్ లు ధరించి వచ్చారు. అదే విధంగా గవర్నర్ కూడా మాస్క్ తోనే తన ప్రసంగం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: