దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ వల్ల సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ నిన్న రాత్రి నుంచి జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతూ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ నిర్ధారణ అయింది. 
 
ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లో కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీ నగరంలో ఇప్పటివరకు 46,000 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా దేశ రాజధానిలో పరిస్థితులు దయనీయంగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: