ఎపిలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.. నేగడచిన 24 గంటల్లో 15,911 మందికి పరీక్షలు నిర్వహించగా 264 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 193 మంది, వ‌ల‌స కూలీలు 44 మంది, విదేశాల నుంచి వచ్చిన 27మంది కి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో న‌మోదైన కేసులు సంఖ్య 6720 కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాల‌లో 5280 కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 237కేసులు, వ‌ల‌స కూలీల 1203 కేసులున్నాయి.. కాగా గ‌డిచిన 24 గంట‌ల‌లో చిత్తూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క‌రు మ‌ర‌ణించారు.

 

ఇక కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 88కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 2341 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ నుంచి కోలుకొని 2851 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: