వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైసీపీ నుంచి పోటీ చేసారు  కాబట్టే గెలిచారు అని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేసారు. 20 రోజుల ముందు పార్టీలో చేరి ఎంపీ అయ్యారు అనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి అని... వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. అసలు ఆయనకు రాజకీయ నేతకు ఉండే లక్షణాలు ఏమీ లేవని అన్నారు. 

 

నరసాపురంలో ఆయన కరోనా కట్టడికి ఏమీ చేయలేదని అన్నారు. అసలు జగన్ ఫోటో లేకపోతే నువ్వు ఎంపీ అయ్యే వాడివా అని ఆయనను నిలదీశారు. వివాదాల కోసమే ఆయన పని చేస్తారు అని అన్నారు. ఆయనకు అసలు క్యాడర్ లేదని కేవలం వైసీపీ క్యాడర్ ఆయనను మోశారు అని ఆ కార్యకర్తలు కూడా ఆయనను తప్పుబడుతున్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: