ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామా కృష్ణ రాజు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ సిఎం జగన్ కు ఎంపీ పై ఫిర్యాదు చేసారు. నిన్న మధ్యాహ్నం ఆయన విడుదల చేసిన ఒక వీడియో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఎమ్మెల్యేలతో సిఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వ్యవహారాన్ని సిఎం వద్ద ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. 

 

ఈ సందర్భంగా జగన్ కూడా ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆరోపణలను తిప్పి కొట్టాలి అని పరిస్థితి చేయి దాటితే అప్పుడు చెయ్యాల్సింది చేద్దామని ఆయన చెప్పినట్టు సమాచారం. ఇలాంటి వ్యవహారాలను తాను అసలు సహించేది లేదని జగన్ అన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: