ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం మళ్ళీ మూడు రాజధానుల చుట్టూ తిరుగుతుంది. తాజాగా మూడు రాజధానులు విషయంలో ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా ముడు రాజధానులను వ్యతిరేకిస్తూన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు వైసీపీ నేతలు.  జాతీయ రహదారిపై వెళ్తున్న చంద్రబాబు కాన్వాయిను అడ్డుకుని 'గో బ్యాక్ బాబు ' అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కూడా కొందరు పాల్గొన్నారు అని సమాచారం. ఇక ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు ఈ సందర్భంగా చెదరగొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: