దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం దాని పని అది చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఇలా అన్నీ కూడా కరోనా గుప్పిట్లో ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఈ రాష్ట్రాల మీద ప్రధాని ఫోకస్ చేసారు. ఆయన వారితో మాట్లాడుతున్నారు. ఇక ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని  సమాచారం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాల సిఎం లతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వారిని పూర్తి స్థాయి లాక్ డౌన్ కి ఒప్పించే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: