వైసీపీతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆ పార్టీ అసంతృప్త ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు దాదాపు సిద్ధ‌మ‌య్యారు. రెండు గంట‌ల క్రితం న‌ర‌సాపురం లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి పేర్ని నాని ర‌ఘు నిన్న చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ర‌ఘు ద‌మ్ముంటే ప‌ద‌వికి రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాల్ చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ సింహం సింగిల్‌గా వ‌స్తుంద‌ని.. పందులే గుంపులు గుంపులుగా వ‌స్తాయంటూ త‌న వ్యాఖ్య‌ల‌ను కౌంట‌ర్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఏకి ప‌రేశారు.

 

అలాగే ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇసుక బ్రోకర్ విమ‌ర్శించిన ఆయ‌న నన్ను విమర్శించిన వాళ్ళు జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపించాల‌ని స‌వాల్ విసిరారు. నన్ను విమర్శించిన వాళ్ళు రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తాను... వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నాపై తిట్ల పర్వం కొనసాగించారు... ఇళ్ళ స్థలాల్లో ను ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కోట్లు దండుకున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఏదేమైనా ప‌రిస్థితి చూస్తుంటే పార్టీ నుంచి ర‌ఘును స‌స్పెండ్ చేయ‌డం దాదాపు ఖ‌రారైంద‌ని టాక్‌. అటు ఆయ‌న కూడా ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: