తమిళనాడులో కరోనా వ్యాప్తి ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి అక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వందల కేసులు నమోదు అవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తమిళనాడులో 1,515 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

 

రికార్డ్ స్థాయిలో రాష్ట్రంలో నేడు 49 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,019గా ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 528 వద్ద ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. రాష్ట్ర రాజధాని చెన్నై లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: