ఈ మద్య డబ్బు కోసం దేనికైనా తెగ బడుతున్నారు.. అక్రమంగా సంపాదించడానికి ఎన్నో అడ్డ దారులు తొక్కుతున్నారు.  డబ్బు కోసం, అక్రమ సంబంధాల విషయంలో ఐన వారిని.. నమ్మిన స్నేహితులను సైతం చంపడానికి వెనుకాడటం లేదు. తాజాాగా నమ్మిన స్నేహితులే కాలయములయ్యారు.. దారుణంగా ప్రాణాలు తీశారు.  ఆ మద్య నగరంలోని జూ పార్క్ వద్ద జరిగిన ఓ మర్డర్ మిస్టరీని సౌత్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. అయితే మృతుడి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పపడినట్టు తెలుస్తుంది. అతన్ని  అతి దారుణంగా చంపి, త‌గుల‌బెట్టార‌ని విచార‌ణ‌లో తేలింది. ఈ నెల 1న పాత‌బ‌స్తీ బ‌హదూర్ పురా పీఎస్ ప‌రిధిలో వ‌సీం అనే యువకుడు దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

 

అత‌నిపై రాయితో దాడి చేసి, చంపార‌న్నఅన‌వాళ్లు ల‌భించ‌డంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం హంతకుల కోసం గాలించింది.  మద్యం తాగే సమయంలో వీరి మధ్య ఘర్షణ జరగడంతో వసీంను హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. వారిద్దిరినీ తదుపరి విచారణ కొరకు స్థానిక బహదూర్ పురా పోలీసుల‌కు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. ద‌ర్యాప్తులో మృతుడి స్నేహితులు మిస్రి గంజ్ కి చెందిన మహమ్మద్ ఆసిఫ్, కాలాపత్తర్ కి చెందిన సల్మాన్ ఖాన్ ల‌ను ఇద్దరినీ అదుపులొకి తీసుకుని విచారించగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: