దేశంలో, తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కూడా కష్టమవుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐ.సీ.ఏ.ఐ సీఏ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహిస్తోన్న సీఏ పరీక్షలు కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల రెండు సార్లు వాయిదా పడగా జులై 29వ తేదీన పరీక్షలు నిర్వహించాలని ఐ.సీ.ఏ.ఐ నిర్ణయం తీసుకుంది. 
 
అయితే వివిధ కారణాల వల్ల సీఏ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోతే నవంబర్ లో పరీక్షలు రాసేలా అవకాశం కల్పించనున్నామని తెలిపింది. విద్యార్థులు జులైలో పరీక్షలకు హాజరు కాకుండా నవంబర్ లో హాజరు కావాలనుకుంటే వెబ్ సైట్ లో ఆప్షన్ మార్చుకోవాలని ఐ.సీ.ఏ.ఐ సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: