లాక్ డౌన్ లో దాదాపు రెండు నెలల పాటు ఆగిన రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వరుస రోడ్డు ప్రమాదాల్లో  ప్రజలు ప్రాణాలు కోల్పోతునే ఉన్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 

 

బేస్తవారిపేట మండలం పూసలపాడులో ఈ ప్రమాదం జరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బైక్‌పై ఉపాధి పనులకు వెళ్తున్న భార్యాభర్తలను కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారు ఇద్దరూ కూడా భార్యా భర్తలు అని  స్థానికులు పేర్కొన్నారు. మృతులు మోతుకూరి యేసయ్య, అచ్చమ్మగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: