శ్రీకాకుళం జిల్లాలో ఆట సందడి ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. ఆడుతూ ఆడుతూ వెళ్లి ఇద్దరు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాలోని జెవి పురం గ్రామంలో బావిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు పిల్లలు మరణించారు. 

 

వారిని రక్షించడానికి బావి దగ్గర ఎవరూ లేకపోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసామని దర్యాప్తు చేస్తున్నామని సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావ్ మీడియాకు వివరించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఇద్దరూ కూడా కలిసి చదువుకుంటారు అని అలాగే కలిసి ఆడుకుంటారు అని తల్లి తండ్రులు వారిని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: