పది రోజుల క్రితం సంచలనం సృష్టించిన హైదరాబాద్ షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. పది రోజుల క్రితం 15 లక్షలు లంచం తీసుకుంటూ రెవెన్యు అధికారి నాగార్జున రెడ్డి దొరకడం ఆ తర్వాత కూపీ లాగడంతో ఎమ్మార్వో సుజాత దీని వెనుక ప్రధాన సూత్రధారి అని తెలియడం, 

 

ఆ తర్వాత ఆమె ఇంట్లో విచారణ చేయడం30 లక్షలు దొరకడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ కేసులు సుజాత భర్త అజయ్ ని కూడా అధికారులు విచారించగా భూమి అమ్మగా వచ్చిన సొమ్ము 30 లక్షలు అని భర్త చెప్పడం, ఆమె నా కష్టార్జితం అని చెప్పడంతో పొంతన లేదు అని గుర్తించి సుజాత మీద కేసు నమోదు చేసారు. ఇక ఇప్పుడు అవమాన భార౦తో అజయ్ గాంధీ నగర్ లో భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: