ప్రేమించిన వాళ్లకు సమాజంలో బ్రతికే హక్కు లేదు అంటూ కొందరు మాట్లాడుతూ ఉంటారు. బహుసా కొన్ని కొన్ని ఘటనలు చూస్తే ఇదే నిజం అనే విధంగా ఉంటాయి అని చెప్పవచ్చు. తాజాగా ప్రేమించుకున్న గుర్తు తెలియని యువతీయువకులిద్దరూ చెట్టుకు ఉరి వేసుకున్నారు. తెలంగాణా రాష్ట్రం వికారాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లి శివారులో వారు చెట్టుకు ఉరి వేసుకున్నారు. 

 

పక్కనే బండి కూడా పడి ఉంది. ఇక వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. వారి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు కూడా అధికారులు సేకరించలేదు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: