ఈ మధ్య కాలంలో తిరుపతిలో భారీగా గంజాయి అక్రమ మద్యం గుర్తిస్తున్నారు అధికారులు. తిరుమల కొండపై ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయి అనే ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో అప్రమత్తం అయ్యారు అధికారులు. తాజాగా తిరుమలలో జరిపిన సోదాల్లో ఏకంగా 500 కేజీల గంజాయిని ఒక కారులో స్వాధీనం చేసుకున్నారు. 

 

ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ మధ్య మీడియా రూపంలో కొందరు తిరుమలకు భారీగా మద్యం తరలించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనితో  అధికారులు ఇప్పుడు ఏ మాత్రం కూడా ఉపేక్షించడం  లేదు. వారి మీద కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు. తాజాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: