2019 ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం టీడీపీ మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వైసీపీ నేతలతో కలిసి కనిపించారు. 
 
టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి నిరసనలు తెలుపుతున్న సమయంలో పయ్యావుల కేశవ్ మాత్రం కొడాలి నాని, ఇతర నేతలతో ముచ్చటించారు. దీంతో ఆయన త్వరలో వైసీపీలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. శాసనమండలి నుంచి టీడీపీ నేతలు బయటకు వెళ్లిన తరువాత కూడా ఆయన కొంత సమయం మండలిలోనే ఉండటంతో టీడీపీకి దూరవమవుతున్నాడనే అనుమానాలు బలపడుతున్నయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: