నందమూరి ఫ్యామిలీ సొంత ఊరు నిమ్మకూరులో నేడు నటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. వాస్తవానికి నిన్నా నేడు నేడు ఏపి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ నిన్న  అసెంబ్లీ సమావేశాలను టీడీపీ వాకౌట్ చేయడంతో సొంతూరుకు వెళ్లారు. అక్కడి బంధువుల ఇంటికి వెళ్లి కాసేపు గడిపారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా రోజలు తర్వాత తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ రావడంతో సంతోషంలో మునిగిపోయారు గ్రామస్థులు. 

 

బాలయ్యకు గ్రామస్థులు, అభిమానులు బాలయ్యకు ఆత్మీయంగా స్వాగతం పలికారు.  గత వారం ఏపిలో రాజకీయాల్లో పలు సంచలనాలు జరిగిన విషయం తెలిసిందే. తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులు, బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడే అవకాశం కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

 

ఇదిలా ఉంటే నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభంలో సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు.  ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలు కేటాయింపుల గురించి సభలో చదివి వినిపించారు. ఏయే శాఖకు ఎన్ని నిధులు కావాలి?.. ఎంత కేటాయించారు అనేదానిపై బుగ్గన సభకు వివరించారు. కాగా, బుగ్గన రాజేంద్రనాథ్  ప్రసంగం తర్వాత ఉప సభాపతి కోన రఘుపతి ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: