కరోనా దెబ్బకు తమిళనాడు మొత్తం షేక్ అవుతుంది. పరిస్థితి ఇప్పుడు తమిళనాడు లో దాదాపుగా ఆందోళనకరంగా ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు అనే చెప్పాలి. ఇక తాజాగా తమిళనాడు లో ఒక పరిణామం చోటు చేసుకుంది. కరోనాతో  ఆ రాష్ట్ర సిఎం పళని స్వామి పిఏ ప్రాణాలు కోల్పోయారు. 

 

పళని స్వామి కార్యాలయ కార్యదర్శి దామోదరం కరోనాతో మృతి చెందారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూయడం తో అందరూ షాక్ అయ్యారు. ఆయన అత్యున్నత స్థాయి అధికారి. అలాంటి వ్యక్తి కరోనాతో మరణించడం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ రాష్ట్ర సచివాలయంలో 200 మందికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: