గత కొన్ని రోజులుగా చైనా భారత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా బలగాల దాడిలో ఒక కల్నల్  ఇద్దరు సైనికులు మరణించడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇది మరవకముందే మరింత మంది సైనికులు చనిపోవడం పై ప్రస్తుతం దేశం మొత్తం రగిలిపోతుంది. తాజాగా ఈ ఘటనపై శివసేన ఏపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో స్పందించారు. 

 


 చైనా దూకుడు కి బుద్ధి చెప్పాలని  అంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అంతా మోడీ వెంటే ఉంటారు అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఒక బుల్లెట్ తగలకుండానే 20 మంది సైనికులు అమరులయ్యారు. మనం ఏం చేసాం..?  ఎంతమంది చైనా చైనా సైనికులు చనిపోయారు..? ప్రస్తుతం దేశం మొత్తం ప్రధాని వెంటే ఉంది కానీ వాస్తవం ఏమిటి... దేశం మొత్తం నిజం ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది అంటూ సంజయ్ రౌత్ ఒక పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: