లడక్ లోని గాల్వాన్ వ్యాలీలో భారత్ చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా సైనికులు ఒక్కసారిగా దాడికి దిగడంతో... భారత సైన్యంలోని కల్నల్  సంతోష్ బాబు తో పాటు 20 మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ఇక ఈ వీర సైనికుల త్యాగాలకు దేశవ్యాప్తంగా ఎంతోమంది నివాళులు అర్పిస్తున్నారు. 

 


 తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైనికుల మరణం పై స్పందించారు. 20 మంది భారత సైనికులు వీరమరణం పొందటం తన హృదయాన్ని ద్రవింపచేసింది అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు కుర్రాడు సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. మాకు ఎంతో గర్వంగా ఉంది  అంటూ అతని తల్లిదండ్రులు చెప్పడం దేశానికి గర్వకారణం. సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: