ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. నేడు రికార్డ్ స్థాయిల్ 350 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏ మాత్రం కూడా కేసులు అదుపు కావడం లేదు. 

 

తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఇద్దరు సచివాలయ వాలంటీర్లకు కరోనా పాజిటివ్‌‌ అని తెలిసింది. ఈ రెండు కేసులతో కలిపి సచివాలయంలో మొత్తం ముగ్గురు కరోనా బారిన పడ్డారని అధికారులు పేర్కొన్నారు. పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగుపల్లిలో ఈరోజు కొత్తగా మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. ఇప్పటి వరకు ఆర్.ఏనుగు పల్లిలో ఏడు కరోనా కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: