దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. కరోనా మరణాలు కూడా అక్కడ వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఢిల్లీ లో ఆగే పరిస్థితి లేదు. ఇక తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరికీ కరోనా సోకింది అని అధికారులు వెల్లడించారు. 

 

ఆమె ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే అతిషి, పార్టీ ప్రతినిధి అక్షయ్ మరాఠేలకు కరోనా పాజిటివ్‌గా వెల్లడి అయింది. ఇద్దరికీ హోం క్వారంటైన్ లోనే చికిత్స అందిస్తున్నారు. ఇక ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ కి కరోనా భయం పట్టుకుంటుంది. ఆయనకు కరోనా పరిక్షలు నేడు రెండో సారి నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: