కరోనా దెబ్బకు ఇప్పుడు చాలా వరకు స్మార్ట్ ఫోన్ లు బాగు చేయించుకునే అవకాశం అనేది లేకుండా పోయింది అని చెప్పవచ్చు. ప్రజలు బయటకు వెళ్ళినా సరే షాప్ లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆప్పుడు సామాన్యులు స్మార్ట్ ఫోన్ లేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం ఫ్లిప్ కార్ట్ కొత్త సేవను మొదలు పెట్టింది. 

 

వారెంటీలో ఉన్న స్మార్ట్‌ఫోన్ పాడైతే కస్టమర్లు సర్వీస్ సెంటర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వారెంటీ అసిస్టెంట్ సర్వీస్ కోసం రూ. 99 చెల్లిస్తే ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటీవ్ ఇంటికి వచ్చి స్మార్ట్‌ఫోన్ తీసుకుని వెళ్తారు. బ్రాండెడ్ సర్వీస్ సెంటర్లలో బాగు చేయించి మీ ఫోన్ మీకు తీసుకొచ్చి ఇస్తారు. థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ అయిన ‘జీవీస్ కన్స్యూమర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా ఈ సేవలను మీకు అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: