కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 24 మంది తీవ్రంగా ఈ ఘటనలో గాయపడ్డారు అని తెలుస్తుంది. 

 

ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 26 మందితో ట్రాక్టర్‌లో దైవదర్శ నానికి వేదాద్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. స్థానికులు అందించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు 9 మంది మరణించగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: